Breaking News

జైల్లో అస్వస్థతకు గురైన సినీనటి రాగిణి.. ఆస్పత్రికి తరలింపు


బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కర్ణాటకలోనూ డ్రగ్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదితో పాటు కొందరు డ్రగ్స్ డీలర్లను అరెస్ట్ చేశారు. ఇటీవలే సంజనా బెయిల్‌పై బయటకు రాగా.. రాగిణి ఇంకా జైలు జీవితం గడుపుతోంది. జైల్లో విచారణ ఖైదీలో ఉన్న ఆమె ప్రస్తుతం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పోలీసులు ఆమెను వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాగిణి తీవ్రమైన నడుము నొప్పితో బాధపడటంతో పాటు ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నారని డాక్టర్లు తెలిపారు. సెంట్రల్ జైలులోని ఆస్పత్రిలో ఆమెను పరీక్షించిన డాక్టర్లు మెరుగైన చికిత్స అందించాలని సూచించడంతోనే రాగిణిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే బెయిల్ కోసం రాగిణి అనేకసార్లు పిటిషన్ దాఖలు చేసినా న్యాయస్థానం కొట్టివేసిది. కోర్టు మరోసారి బెయిల్ క్యాన్సిల్ చేయడంతోనే రాగిణి ఆందోళన చెంది అనారోగ్యానికి గురయ్యారని, ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించేందుకు అవకాశం ఇవ్వాలని కొద్దిరోజుల క్రితమే రాగిణి తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఆ విన్నపాన్ని కూడా న్యాయస్థానం తిరస్కరించడంతో రాగిణి మరింత ఆందోళన పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు డాక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.


By December 25, 2020 at 01:41PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sandalwood-drug-case-jailed-heroine-ragini-dwivedi-taken-to-hospital/articleshow/79952658.cms

No comments