Breaking News

మహిళపై 10 మంది గ్యాంగ్‌రేప్.? చిత్తూరు జిల్లాలో కలకలం


పెళ్లైన మహిళని కొండగుట్టల్లోకి తీసుకెళ్లి యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. గుర్రంకొండ మండల కేంద్రానికి సమీపంలో జీవనతోపునకు వెళ్లే దారిలో సిద్దేశ్వర గుట్ట వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్తున్న మహిళ(30)ను బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో గుట్ట వద్ద పది మంది వరకూ యువకులు గుమికూడి ఉండడం స్థానిక రైతులు గమనించారు. మద్యం సేవించడానికి వచ్చి ఉంటారని భావించారు. అయితే సుమారు 8.30 గంటల సమయంలో ఓ మహిళ గాయాలతో సమీపంలోని కోళ్లఫారం వద్దకు పరిగెత్తుకొచ్చిందని.. పది మంది యువకులు తనపై అత్యాచారం చేశారని భోరున విలపించినట్లు స్థానికులు చెబుతున్నారు. బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకున్న కోళ్లఫారం సిబ్బంది, స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వచ్చి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన జీవనతోపు ప్రాంతంలో రాత్రి వరకూ మందుబాబులు ఉంటారని.. మందుబాబులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక మరెవరైనా ఆమెను బంధించి తీసుకొచ్చి అత్యాచారం చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడం గమనార్హం. అత్యాచార ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. Also Read:


By December 22, 2020 at 11:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chittoor-woman-gangraped-by-ten-youth/articleshow/79852082.cms

No comments