Breaking News

GHMC: ప్రత్యేక మున్సిపాలిటీగా జూబ్లీహిల్స్.. హైదరాబాద్ గురించి ఆసక్తికర విశేషాలు!


ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 1న ఎన్నికలు నిర్వహించనుండగా... నాలుగో తేదీన ఫలితం తేలనుంది. ఈ దఫా మేయర్ పీఠాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మున్సిపాలిటీకి మొదటిసారి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి..? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) జీహెచ్‌ఎంసీగా మారింది..? తదితర ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 1934లో తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు హైదరాబాద్ ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఉంది. 1950లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని అమలు చేశారు. ఆ తర్వాతే ఉమ్మడి ఏపీలోని అన్ని మున్సిపాలిటీలకు ఈ చట్టాన్ని వర్తింపజేశారు. ఆ చట్టం ఆధారంగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. 1942 నుంచి 1950 మధ్య హైదరాబాద్ లేదు. 1942లో ఏర్పాటైన హైదరాబాద్ మున్సిపాలిటీ.. 1950లో మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటైంది. గతంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లకు కలిపి ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఉండేది. 1937లో ఏర్పాటైన జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ 1950లో హైదరాబాద్‌లో విలీనమైంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) 2007లో జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)గా మారింది. వాస్తవానికి ఈ మేరకు 2005లోనే ఆదేశాలను జారీ చేశారు. దేశంలో అతి తక్కువ కాలం మనుగడలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ సికింద్రాబాద్. 1951 ఏప్రిల్ 16న సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. కానీ నాలుగేళ్ల తర్వాత 1955లో హైదరాబాద్‌లో విలీనమైంది.


By November 18, 2020 at 08:00AM


Read More https://telugu.samayam.com/telangana/news/jubilee-hills-municipality-was-formed-in-1937-but-merged-with-hyderabad-in-1950/articleshow/79274006.cms

No comments