Breaking News

పెళ్లి మండపంలో దంపతుల పాడుపని.. కామారెడ్డిలో షాకింగ్ ఘటన


బంధువుల ఇంట పెళ్లికొచ్చిన దంపతులు పాడుపని చేశారు. గుట్టుచప్పుడు కాకుండా చేతివాటం ప్రదర్శించారు. వధువు బంధువుల బంగారం చోరీ చేశారు. అయితే పెళ్లి వారు ఆ విషయం గమనించడంతో కథ అడ్డం తిరిగింది. తోడుదొంగలుగా మారిన భార్యాభర్తలు దొరికిపోయారు. పెళ్లి కొచ్చి ఈ పాడుపనేంటంటూ బంధువులే చితక్కొట్టి మరీ పోలీసులకు అప్పగించారు. ఈ షాకింగ్ ఘటన జిల్లాలో జరిగింది. కామారెడ్డిలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకల్లో చోరీ జరిగింది. బంధువుల ఇంట పెళ్లికొచ్చిన దంపతులు.. వధువు తరఫు బంధువుల బంగారం దొంగిలించారు. ఎవరూ చూడలేదనుకుని గుట్టుచప్పుడుకాకుండా చేతివాటం చూపించారు. మూడు తులాల బంగారు ఆభరణాలు మాయం కావడంతో మండపంలో కలకలం రేగింది. దంపతులు బంగారం చోరీ చేయడాన్ని గమనించిన బంధువులు ఇద్దరినీ వెతకడంతో అసలు విషయం బయటపడింది. చోరీకి గురైన బంగారం వారి వద్దే ఉండడంతో బంధువులు దంపతులను చితక్కొట్టారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బంగారాన్ని దొంగిలించిన దంపతులు ఇందిరానగర్ కాలనీకి చెందిన పరమేశ్, యశోదలుగా గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By November 24, 2020 at 01:05PM


Read More https://telugu.samayam.com/telangana/news/couple-robs-gold-in-relatives-marriage-function-in-kamareddy/articleshow/79384962.cms

No comments