ముఖంపై స్ప్రే చల్లి హత్య.. గుంటూరులో షాకింగ్ మర్డర్

గుంటూరులో షాకింగ్ చోటుచేసుకుంది. ముఖంపై స్ప్రే చల్లడంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఘటన వెలుగుచూసింది. పెదకూరపాడు మండలం 75 తాళ్లూరుకి చెందిన హోటల్ యజమాని భాష్యం బ్రహ్మయ్య వ్యర్థాలను పారబోసేందుకు ఊరి శివారుకు వెళ్లిన సమయంలో బైక్పై వచ్చిన ఆగంతకులు దాడి చేశారు. బ్రహ్మయ్య ముఖంపై స్ప్రే చల్లడంతో తీవ్రగాయాలతో ఇంటికి చేరుకున్నాడు. ముఖం కాలిపోయిన గాయాలైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు బ్రహ్మయ్యను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. ముఖంపై స్ప్రే చేసి చంపడం స్థానికంగా సంచలనంగా మారింది. యాసిడ్ అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By November 05, 2020 at 10:22AM
No comments