Breaking News

గ్రామంలో అందరికీ కరోనా వైరస్ పాజిటివ్.. క్వారంటైన్‌లో ఆ ఒక్కడు!


గ్రామంలో అందరికీ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఓ వ్యక్తికి మాత్రం నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయన ఒక్కడు మాత్రమే క్వారంటైన్‌‌లో ఉన్నారు. ఇది హిమాచల్‌ప్రదేశ్‌ లాహౌల్-స్పీతి జిల్లా పరిధిలోని థొరాంగ్ గ్రామంలో పరిస్థితి. ఒక వ్యక్తి గ్రామంలోని మిగతా 42 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈయన మినహా భార్య సహా కుటుంబంలోని ఆరుగురికి కూడా కరోనా సోకింది. ఆ గ్రామంలో కరోనా బారినపడని ఒకే ఒక్కడుగా భూషణ్ ఠాకుర్(52) నిలిచారు. తాను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే తనకు వైరస్ సోకలేదని భూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా లాహౌల్- స్పీతికి చెందిన వైద్యులు డాక్టర్ పల్జోర్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన భూషణ్ రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. గ్రామంలోని అందరికీ కరోనా పాజిటివ్‌‌గా నిర్దారణ అయినా.. భూషణ్‌కు మాత్రం నెగిటివ్ రావడం విచిత్రంగా అనిపించిందని పేర్కొన్నారు. ముందు గ్రామానికి చెందిన ఐదుగురికి వైరస్ నిర్ధారణ కావడంతో గ్రామస్థులంతా స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ మారుమూల గిరిజన గ్రామంలో మొత్తం 100 మంది నివసిస్తుంటారు. విపరీతంగా మంచు కురుస్తున్న కారణంగా కొంతమంది కూలూ ప్రాంతానికి వెళ్లిపోయారని పల్జోర్ అన్నారు. ఇక, కరోనా నెగెటివ్ వచ్చిన భూషణ్ తన కుటుంబంలోని ఇతరులకు దూరంగా ఒక గదిలో ఉంటున్నాడు. స్వయంగా వంట చేసుకుని, క్వారంటైన్‌ నిబంధనలు పాటిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు భూషణ్ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా అతనికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కరోనాకు తేలికగా తీసుకోవద్దని, మాస్క్ ధరించడంతోపాటు శానిటైజ్ చేసుకోవడం మరచిపోకూడనది భూషన్ సూచించాడు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటి వరకూ 31,400 మందికి వైరస్ నిర్దారణ కాగా.. 468 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం కొత్తగా 661 మందికి వైరస్ నిర్దారణ అయ్యింది.


By November 19, 2020 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/all-villagers-are-positive-but-one-in-quarantine-in-lahaul-spiti-in-himachal-pradesh/articleshow/79295123.cms

No comments