ఇంట్లో తెలిసిన ప్రేమ వ్యవహారం.. భయంతో ప్రేమజంట.!

తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోవడంతో భయాందోళనకు గురైన ప్రేమజంట అఘాయిత్యం చేసుకుంది. పురుగులమందు తాగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ అత్యంత విషాద ఘటన జిల్లాలో జరిగింది. తాండూర్ మండలం మల్రెడ్డిపల్లికి చెందిన బాలరాజ్(22) అదే గ్రామానికి చెందిన టీనేజ్ యువతి(16) కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం ఇద్దరి ఇళ్లలో తెలిసిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులకు భయపడి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పురుగుల మందు తాగి ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. బాలరాజ్ని హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. యువతీయువకుల మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. Also Read:
By November 05, 2020 at 09:28AM
No comments