Breaking News

ప్రియురాలిని పొలాల్లోకి తీసుకెళ్లి.. దారుణం.. వీడిన వనపర్తి మర్డర్ మిస్టరీ


వనపర్తి జిల్లాలో కలకలం రేపిన పత్తి పొలంలో యువతి మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియుడే ఆమెను నమ్మకంగా తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చినట్లు తేలింది. అనంతరం ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కూతురు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేసేది. అక్కడే ఆత్మకూరుకు చెందిన శ్రీనివాస్‌‌తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఏడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియురాలితో కొద్దికాలం బాగానే ఉన్న శ్రీనివాస్ తరచూ ఆమెతో గొడవపడడం మొదలుపెట్టాడు. మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రియురాలు శ్రీనివాస్‌ని నిలదీయడంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఆమెకు ఫోన్ చేసి గ్రామానికి రావాలని కోరాడు. ప్రియుడిని నమ్మేసిన యువతి హైదరాబాద్‌ నుంచి సొంతూరుకి బయలుదేరింది. జడ్చర్ల వద్ద ఆమెను బైక్ ఎక్కించుకున్న శ్రీనివాస్ కొత్తకోట సమీపంలోని అమరచింత వద్దకు తీసుకెళ్లాడు. ఆమెకు మాయమాటలు చెప్పి కొత్త తండా సమీపంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడు. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు పొలంలో పత్తి తీసేందుకు వెళ్లిన కౌలురైతు కతలన్న యువతి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Also Read: మరోవైపు హైదరాబాద్‌ నుంచి వస్తున్నానని చెప్పిన కూతురు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని చెప్పడంతో ఆ నంబర్ ఆధారంగా హత్యకు గురైన యువతిని గుర్తించారు. నిందితుడు శ్రీనివాస్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. అయితే శ్రీనివాస్ ఒక్కడే ఈ హత్య చేశాడా? లేక మరెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Read Also:


By November 15, 2020 at 12:45PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/girlfriend-raped-killed-brutally-in-wanaparthy/articleshow/79230663.cms

No comments