Breaking News

రెండు బైకులు ఢీకొని ఇద్దరి మృతి.. గుంటూరులో విషాదం


గుంటూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న బైకులు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వట్టిచెరుకూరు మండలం కుర్నూతల సమీపంలోని ఐదో మైలు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రూరల్ మండలం ఏటుకూరుకి చెందిన ప్రతాప్(22), ప్రత్తిపాడు మండలం నిమ్మగడ్డవారిపాలేనికి చెందిన పోట్లూరి వాసు(34) మృతి చెందారు. ప్రమాదంలో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్న రవిప్రకాష్‌కి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108లో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By November 18, 2020 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-killed-in-road-accident-in-guntur/articleshow/79275528.cms

No comments