మధ్యప్రదేశ్ ఉప-ఎన్నికలు.. అధికారం నిలబెట్టుకోవాలంటే 8 స్థానాల్లో తప్పక గెలవాల్సిందే

జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురేసి బీజేపీలో చేరడం, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చనిపోవడంతో ఉప-ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో మధ్యప్రదేశ్లో 28 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు సైతం మంగళవార వెలువడుతోంది. ఇందుకోసం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన .. కమల్నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, కేవలం 15 నెలల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. మార్చిలో గూటికి సింధియా వర్గం చేరిన విషయం తెలిసిందే. దాని ఫలితంగా ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం బీజేపీకి 107, కాంగ్రెస్కు 87 మంది ఎమ్మెల్యేలున్నారు. సాధారణ మెజార్టీ 116 కాగా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మరో 8 సీట్లు అవసరం. ఉప-ఎన్నికలు జరిగిన ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే వీలుంటుంది. 28 చోట్లకు ఎన్నికలు జరగ్గా.. 27 స్థానాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ వర్గానికి అనుకూలంగా రానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గుజరాత్, యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
By November 10, 2020 at 09:01AM
No comments