Breaking News

ఢిల్లీ: మాస్క్ మాత్రమే కాదు భౌతికదూరం పాటించకపోయినా, ఉమ్మినా రూ.2వేలు ఫైన్


దేశ రాజధాని ఢిల్లీలో కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్లూ మాస్క్ ధరించాలని, అలా కాకపోతే రూ.2వేలు జరిమానా విధిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించేలా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వాడినా, భౌతికదూరం పాటించకపోయినా రూ.2వేలు చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. విషయంలో ప్రజల్లో భయం పెంచడానికి వీలుగా గతంలో రూ.500లుగా ఉన్న జరిమానాను రూ.2వేలుకు పెంచింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఆమోదం అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఇదిలా ఉండగా ఢిల్లీలో కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం తాజాగా 6,608 కేసులు నమోదు కాగా.. మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఢిల్లీ కరోనా బాధితుల సంఖ్య 5.17లక్షలకు చేరుకోగా.. మరణాలు 8154కి చేరుకున్నాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని ప్రయివేట్ హాస్పిటల్స్‌లో 80 ఐసీయూ పడకలను కరోనా బాధితులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే, టెస్టింగ్ కేంద్రాలను ప్రతి జిల్లాలనూ రెండింతలు చేయాలని సూచించింది. అక్టోబరు 28 నుంచి రోజూ 5వేలకుపైగా కేసులు బయటపడుతుండగా.. నవంబరు 11 రికార్డు స్థాయిలో 8వేలకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.


By November 21, 2020 at 06:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/spitting-and-tobacco-consumption-in-public-places-to-attract-rs-2000-fine-says-delhi-govt/articleshow/79333040.cms

No comments