Breaking News

వర్మకు షాక్ ఇచ్చిన దిశ తండ్రి... హైకోర్టులో పిటిషన్


దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషంయ తెలిసిందే. అయితే ఈ ఉదంతంపై ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు. అయితే ఈ విషయంపై దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. తన కూతురికి జరిగిన దారుణం ఆధారంగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తీస్తున్న సినిమాను అడ్డుకోవాలని కోరుతూ వేశారు. వర్మ తీస్తున్న సినిమాను కేంద్ర ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డు ఎందుకు నియంత్రించడం లేదో ప్రశ్నించాలని తన పిటిషన్‌లో ఆయన కోర్టును కోరారు. ఈ ఘటనను సినిమాగా తీయాలనుకోవడం సరికాదని దిశ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ పి. నవీన్‌ రావు శుక్రవారం విచారణకు స్వీకరించారు. వ్యాజ్యంపై స్పందించిన అసిస్టెంట్‌ సోలిసిటర్‌ జనరల్‌(ఏఎ్‌సజీ) ఎన్‌. రాజేశ్వరరావు.. కేంద్ర ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డు తీసుకున్న చర్యలను కనుక్కుంటామని కోర్టుకు తెలిపారు. అందుకోసం కొంత సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. న్యాయమూర్తి అంగీకారంతో కాసేపటి తర్వాత కోర్టుకు తిరిగి వచ్చిన ఏఎ్‌సజీ, కేంద్ర ప్రభుత్వానికి, సెన్సార్‌ బోర్డుకు పిటిషనర్‌ రాతపూర్వకంగా ఎలాంటి అభ్యర్థన చేయలేదని వివరించారు. Read More: దీంతో దిశ తండ్రి వేసిన పిటిషన్‌పై వాదనలు ఆలకించిన న్యాయమూర్తి, ఇప్పటికైనా త్వరితగతిన పిటిషనర్‌ అభ్యర్థనను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెన్సార్‌ బోర్డును ఆదేశించారు. గత ఏడాది నవంబరులో జరిగిన దిశ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిపిన నిందితులు ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. అయితే ఈ కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ జరిపిన విషయం కూడా తెలిసిందే. అయితే వర్మ ఇప్పటికే దిశ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు.


By October 10, 2020 at 06:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/disha-father-petition-in-high-court-over-ram-gopal-varma-disha-movie/articleshow/78584334.cms

No comments