Breaking News

ఒకే ప్రియురాలితో స్నేహితుల ఆ సంబంధం.. చివరికి దారుణం


ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే మహిళతో పెట్టుకున్నారు. తీరా ఆ విషయం బయటపడిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు రేగాయి. స్నేహం కాస్తా శత్రుత్వంగా మారిపోయింది. మహిళ మోజులో స్నేహితుడినే అంతమొందించేందుకు సిద్ధమైపోయాడు. నమ్మకంగా పిలిచి విషం కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించాడు. అది తెలియక తాగేసిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ అమానుష ఘటన జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యడ్లపాడుకి చెందిన దాట్ల గోపీవర్మ(20), మర్రిపాలేనికి చెందిన కొమ్మూరి ప్రేమ్‌చంద్ స్నేహితులు. ప్రేమ్‌చంద్ కాకుమాను మండలం గరికపాడుకి చెందిన తన సమీప బంధువైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పడప్పుడూ గోపీ ఫోన్‌తో ప్రేమ్‌చంద్ సదరు మహిళతో మాట్లాడేవాడని తెలుస్తోంది. ఇటీవల ప్రేమ్‌చంద్‌కి వివాహం జరిగింది. అనంతరం కూడా ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. తన స్నేహితుడు గోపీ వర్మ కూడా ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలియడంతో స్నేహితుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో గోపీ వర్మని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రేమ్‌చంద్. ఈ నెల 2వ తేదీన మాట్లాడుకుందామని యడ్లపాడు - నాదెండ్ల రోడ్డులోని చప్టా వద్దకు పిలిచాడు. పథకం ప్రకారం గడ్డిమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి తాగించాడు. అది తెలియని గోపీ వర్మ కూల్‌డ్రింక్ తాగేశాడు. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. Also Read: మరుసటి రోజు గోపీ వర్మ వాంతులు చేసుకుని ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అతని ఆరోగ్యం మరింత దిగజారడంతో గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పదో తేదీ గోపీ మృతి చెందాడు. విషప్రయోగం జరిగినట్లు తెలియడంతో మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ప్రేమ్‌చంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. Read Also:


By October 11, 2020 at 11:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-friend-over-extramarital-affair-in-guntur/articleshow/78600342.cms

No comments