Breaking News

కిడ్నాప్ కోసం వచ్చిన క్రిమినల్.. మందు తాగి మరొకరిని కాల్చేశాడు.! బెజవాడలో షాకింగ్


విజయవాడలో కలకలం రేపిన పోలీస్ కమిషనరేట్ జూనియర్ అసిస్టెంట్ గజకంటి మహేష్ హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నాప్ కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చిన నిందితుడు మద్యం మత్తులో మహేష్‌తో గొడవపడి తుపాకీతో జరిపినట్లు పోలీసులు తేల్చారు. నిందితుల అరెస్టు అనంతరం బెజవాడ పోలీస్ కమిషనర్ బత్తిని శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన ఆటోడ్రైవర్ రాధాక్రిష్ణా రెడ్డికి హైదరాబాద్‌కి చెందిన సాకేత్ రెడ్డి స్నేహితుడు. తెనాలికి చెందిన సందీప్ గుంటూరులో ఒకరిని కిడ్నాప్ చేయడంతో పాటు మరొకరికి వార్నింగ్ ఇప్పించేందుకు హైదరాబాద్ నుంచి సాకేత్ రెడ్డిని రప్పించాడు. తన స్నేహితుడు రాధాక్రిష్ణా రెడ్డి ఆటోలో గంగాధర్‌తో కలసి వచ్చిన సాకేత్.. మహేష్‌తో కలసి మద్యం తాగుతూ గొడవపడ్డాడు. వేరొకరిని కిడ్నాప్ చేసేందుకు వచ్చిన సాకేత్ మద్యం మత్తులో తుపాకీ తీసి మహేష్‌పై కాల్పులు జరిపాడు. Also Read: అయితే ప్రధాన నిందితుడు సాకేత్ ఎప్పుడూ రివాల్వర్ జేటులో పెట్టుకుని తిరుగుతాడని పోలీసు విచారణలో తేలింది. ఆ తుపాకీని బిహార్‌లోని గయాలో రూ.45 వేలకు కొనుగోలు చేసినట్లు సీపీ శ్రీనివాస్ తెలిపారు. హత్య కేసుతో పాటు కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని.. వారిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నట్లు సీపీ వెల్లడించారు. Read Also:


By October 21, 2020 at 10:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vijayawada-police-cracks-mahesh-murder-case/articleshow/78781466.cms

No comments