Breaking News

అయోధ్యకు చేరిన భారీ గంట.. మోగించిన వెంటనే కిలోమీటర్ల దూరం వినిపించే ‘ఓం’ శబ్దం


రామమందిరం కోసం రామేశ్వరంలో ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ కంచు గంట అయోధ్యకు చేరింది. మొత్తం 613 కిలోల బరువున్నఈ కంచు గంటను రామేశ్వరానికి చెందిన భక్తురాలు, లీగల్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మండా రాజ్యలక్ష్మి తయారుచేయించారు. రామరథయాత్ర పేరిట ప్రత్యేక వాహనంలో అయోధ్యకు తరలించారు. ప్రధాన మోదీ పుట్టినరోజైన సెప్టెంబరు 17న బయలుదేరిన ప్రత్యేక వాహనం 21 రోజుల పాటు 11 రాష్ట్రాలమీదుగా 4,555 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అయోధ్యకు చేరుకుంది. యాత్రకు ముందు రామేశ్వరంలోని రామమందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామేశ్వరానికి హిందూ పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. సీత్వానేషణలో భాగంగా రామేశ్వరం నుంచి శ్రీలంకకు వానరసేనతో కలిసి శ్రీరాముడు సముద్రంలో వారధిని నిర్మించారు. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. మొత్తం 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ గంట మోగిస్తే ‘ఓం’ శబ్ధం కొన్ని కిలోమీటర్ల దూరం వినిపిస్తోంది. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడితోపాటు వినాయకుడి ప్రతిమలతోపాటు జై శ్రీరాం అనే అక్షరాలు రాసిన ఈ గంటను రాజ్యలక్ష్మి రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు. ‘రామాలయానికి భారీ కంచు గంటను కానుకగా ఇవ్వడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ దైవకార్యంలో నాకు అవకాశం కల్పించినందుకు ఆనందంగా ఉంది’అని రాజ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. కోట్లాది మంది హిందువుల కలను సాకారం చేసిన భూమిపూజ కార్యక్రమం అనంతరం తాను గంట బహుమతిగా ఇవ్వడం తన మహద్ భాగ్యమని రాజ్యలక్ష్మి వివరించారు. గంటపై ఉన్న ఐదు ప్రతిమల బరువు 210 కిలోలు ఉంటుందని రాజ్యలక్ష్మి అన్నారు.


By October 08, 2020 at 09:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/613-kgs-brass-bell-presented-to-ayodhya-ram-temple-by-rameswaram-devotee/articleshow/78546324.cms

No comments