Breaking News

రేప్ కేసులో నిందితుడికి విచారణకు ముందు ఫిర్యాదు చేసే అర్హత లేదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు


లైంగిక వేధింపుల కేసులో నేరారోపణలను ట్రయల్ కోర్టు గుర్తించే వరకూ నిందితుడు ఫిర్యాదును స్వీకరించే అర్హత లేదని సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ నమోదు చేసిన బాధితురాలు వాంగ్మూలం కాపీలు సహ సంబంధిత పత్రాలు నిందితుడికి పొందే అర్హత లేదని తెలిపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద కేసులో ఈ మేరకు వెల్లడించింది. స్వామి చిన్మయానంద ఆశ్రమ ఆధ్వర్యంలో నడుస్తోన్న లా కాలేజీలో విద్యార్థినిపై ఆయన అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఈ కేసులో షాజహాన్‌పూర్ బాధితురాలు నుంచి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం కాపీని ఇవ్వాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని జస్టిస్ యుయు లలిత్, వినీత్ సరన్, ఎస్ రవీంద్ర భట్‌ల ధర్మాసనం తోసిపుచ్చింది. ‘చార్జ్‌షీట్‌లో పొందుపరించిన బాధితురాలి వాంగ్మూలం సహా సంబంధిత పత్రాల కాపీలను సెక్షన్ 164 కింద నిందితుడికి పొందే అర్హత లేదు.. చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత తగిన ఉత్తర్వులు కోర్టు వెలువరించే వరకు సెక్షన్ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం కాపీ పొందే అర్హతలేదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం హథ్రాస్ ఘటన మాదిరిగానే స్వామి చిన్మయానంద లైంగిక ఆరోపణల అంశం కూడా మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో బాధితురాలు పోస్ట్ చేసిన వీడియోతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఆరోపణలు చేస్తోందని, రూ.5 కోట్ల డిమాండ్ చేసిందని చిన్మయానంద వాదించారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించడంతో ఆయనపై కేసు నమోదుచేశారు. ఆయనపై ఆరోపణలు చేసిన తర్వాత కనిపించకుండా పోయిన బాధిత యువతిని గతేడాది ఆగస్టు 30 రాజస్థాన్‌లో గుర్తించారు.


By October 09, 2020 at 07:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rape-accused-cant-access-complaint-before-trial-sc-ruling-in-swamy-chinmayananda-case/articleshow/78565221.cms

No comments