Breaking News

తల్లి తల నరికి తీసుకెళ్లిన కసాయి కొడుకు.. తెలంగాణలో కిరాతకం


కన్నతల్లిని కిరాతకంగా నరికి చంపి తలను తీసుకెళ్లాడో కసాయి కొడుకు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఉన్మాదంతో రెచ్చిపోయి ఘాతుకానికి పాల్పడ్డాడు. తల, మొండెం వేరుచేసి తలను తీసుకెళ్లిపోయాడు. ఈ అత్యంత అమానుష ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన సంగణమోని చంద్రమ్మ(65), తన కొడుకు రాముడు(40)తో కలసి నివాసముంటోంది. మద్యానికి బానిసైన కొడుకు నిత్యం డబ్బుల కోసం వేధిస్తుండేవాడు. రాత్రి కూడా మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ తల్లితో గొడవపడ్డాడు. ఆమె నిరాకరించడంతో ఘాతుకానికి తెగబడ్డాడు. కొడవలితో గొంతుకోసి కిరాతకంగా తల్లిని హత్య చేశాడు. అనంతరం ఆమె తలను మొండెం నుంచి వేరుచేశాడు. తల్లి తలతో అక్కడి నుంచి పరారయ్యాడు. కేవలం మొండెం మాత్రమే ఇంట్లో పడి ఉంది. కొడుకు రాముడికి రెండు పెళ్లిళ్లు అయినట్లు తెలుస్తోంది. అయితే ఏ పనీపాటా లేకుండా తిరుగుతున్న తాగుబోతు భర్తని పదేళ్ల కిందటే భార్యలు వదిలేసినట్లు తెలుస్తోంది. Also Read: సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనపై గ్రామస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రాముడుకి మద్యం మత్తులో పలువురితో గొడవలు పడేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. అర్ధరాత్రి వేళ ఇంటి తలుపులు కొడుతూ భయాందోళనకు గురిచేసేవాడని తెలుస్తోంది. తల్లి తలతో పరారైన కొడుకు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యా స్థలంలో ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీంను రప్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read Also:


By October 24, 2020 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mother-beheaded-by-drunkard-son-in-nagarkurnool/articleshow/78840804.cms

No comments