ఘాటెక్కిన ఉల్లి.. కేంద్రం కీలక నిర్ణయం.. దిగిరానున్న ధరలు

భారీ వర్షాల కారణంగా సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ధరలు కొండెక్కడంతో ఉల్లి కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఉపశమన చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి ఉల్లి దిగుమతిని పెంచడంతో పాటు వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబరు 15 వరకూ దిగుమతులపై నిబంధనలను సడలించింది. ఈమేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహాల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం పంట ఉత్పత్తులను దిగుమతి చేయడానికి ముందు ఫుమిగేషన్ ద్వారా శుద్ధి చేసే ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరం లేదు. దిగుమతి చేసుకున్న తర్వాత రేవుల్లోనే గుర్తింపు పొందిన సంస్థల ద్వారా దిగుమతిదారులు ఫుమిగేషన్ చేసే వెసులుబాటు కల్పించారు. ఖరీఫ్లో 37 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా.. త్వరలో ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుతాయని వినియోగదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. పది రోజుల కిందట భారత బహిరంగ విపణిలో రూ.11.56 ఉన్న కిలో ఉల్లి.. ప్రస్తుతం రూ.56.95కు చేరిందని పేర్కొంది. ఇది గతేడాదితో పోల్చితే 12.13 శాతం అధికమని వివరించింది. ఆగస్టు చివరి వారం నుంచి క్రమంగా ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఉల్లి దిగుమతి చేసుకునే దేశాలతో సంప్రదింపులు జరపాలని భారత హైకమిషన్స్కు ఆదేశాలు జారీచేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్లో భారీ వర్షాలతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది.. గొడౌన్లలోని స్టోర్ చేసిన ఉల్లి తడవడంతో కుళ్లిపోయింది. నాలుగు రోజుల కిందట వరకు బహిరంగ మార్కెట్లో కిలో రూ.24 ఉన్న ఉల్లిధర ఇపుడు రూ.100కిపైగా పలుకుతోంది. రైతుబజార్లలో బుధవార రూ.84కు చేరింది. వర్షాలవల్ల ఎక్కువశాతం ఉల్లిగడ్డలు కుళ్లిపోయి, దిగుబడి తగ్గింది.
By October 22, 2020 at 07:51AM
No comments