Breaking News

తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్ర విషాదం


జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై పొలం వెళ్తున్న రైతులను వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు మృత్యువాతపడ్డారు. ఆలమూరు మండలం జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై పెట్రోల్ బంకు సమీపంలో ఈ ఘటన జరిగింది. మూలస్థాన అగ్రహారానికి చెందిన రైతులు కర్రి విష్ణు, ఇనపకోళ్ల శ్రీను, తోరాటి రాంప్రసాద్ పొలం పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై రావులపలెం వైపు వెళుతుండగా లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఆలమూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By October 09, 2020 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/three-killed-in-road-accident-in-east-godavari/articleshow/78567504.cms

No comments