Breaking News

ప్రియుడి మోజులో కన్నతల్లి కిరాతకం.. కర్రకి మేకులు కొట్టి.. గుంటూరులో దారుణం


భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ కన్నబిడ్డలను కిరాతకంగా హింసించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో ఏకాంతానికి అడ్డుగా ఉన్నారని మేకులు కొట్టిన కర్రతో చిన్నారులను చితకబాదింది. ఇంటి నుంచి బయటకు నెట్టేయడంతో స్థానికులు స్పందించి కసాయి తల్లిని పోలీసులకు అప్పగించారు. ఈ అమానుష ఘటన జిల్లాలో జరిగింది. బాపట్ల పట్టణానికి చెందిన వివాహిత భర్తను వదిలేసి శ్రీను అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తన ఇద్దరు పిల్లలతో కలసి ఉంటోంది. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని కసాయి తల్లి ఘాతుకానికి తెగబడింది. కడుపున పుట్టిన బిడ్డలను సైతం కిరాతకంగా హింసించడం మొదలుపెట్టింది. కర్రకి మేకులు కొట్టి.. ఆ కర్రతో కొడుకు వీపుపై విచక్షణా రహితంగా దాడి చేసింది. తీవ్రంగా కొట్టి పిల్లలను ఇంటి నుంచి బయటికి నెట్టేయడంతో స్థానికులు గమనించి గ్రామ మహిళా పోలీసు జ్యోతికి విషయం తెలియజేశారు. ఆమె వెంటనే ఇంటి వద్దకు చేరుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న తల్లిని నిలువరించింది. పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read:


By October 28, 2020 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mother-booked-for-harassing-children-over-extramarital-affair-in-guntur/articleshow/78906036.cms

No comments