Breaking News

ప్రకాశంలో దారుణం.. బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం


ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడో కామాంధుడు. తల్లి లేని సమయం చూసి బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి నీచానికి పాల్పడ్డాడు. కనిగిరి పరిధిలోని వెలిగండ్ల మండలం కంకణపాడులో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన మైనర్ బాలిక(11)పై అదే గ్రామానికి చెందిన రాయళ్ల మాలకొండయ్య కన్నేశాడు. ఆమె తల్లి లేని సమయం చూసి బాలికను పొలానికి తీసుకెళ్లాడు. తనతో వస్తే కరివేపాకు కోసి ఇస్తానని చెప్పడంతో బాలిక అతని బైక్ ఎక్కి పొలానికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక కీచకుడు నీచానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికను అమానుషంగా అత్యాచారం చేశాడు. విషయం బయటికి తెలియడంతో గ్రామపెద్దలు బాలిక తల్లికి కొంత నష్టపరిహారం చెల్లించమంటూ రాజీ చేశారు. ఈ దారుణ ఘటన పోలీసులకి తెలియడంతో గ్రామానికి వచ్చి విచారణ జరిపారు. పంచాయితీ చేసిన పెద్దమనుషులను విచారించి నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. Also Read:


By October 09, 2020 at 10:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/11-year-old-girl-raped-in-prakasam-district/articleshow/78566985.cms

No comments