Breaking News

కోడలి మరణంతో కుంగిపోయిన మామ.. ఉరేసుకుని.. చిత్తూరులో విషాదం


కోడలి మరణంతో కుంగిపోయి.. అవమాన భారంతో మామ ఉరేసుకుని చేసుకున్న విషాద ఘటన జిల్లాలో జరిగింది. రెండురోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడం గ్రామంతో తీవ్ర విషాదం నింపింది. జిల్లాలోని చిన్నగొట్టిగల్లు మండలం బోడిరెడ్డిగారిపల్లెలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రామిరెడ్డి(67) కుమారుడు ఆనందరెడ్డికి అదే గ్రామానికి చెందిన హరితతో నాలుగు నెలల కిందట వివాహమైంది. ఆనందరెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా.. హరిత అరగొండ అపోలో ఆస్పత్రి కళాశాలలో నర్సింగ్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా భర్త ఆనందరెడ్డి ఇంటి వద్దనే ఉంటూ వర్క్‌ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. భార్య హరిత మాత్రం రోజూ ఆస్పత్రికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న ఆనందరెడ్డి ఇటీవల ఉద్యోగం మాన్పించేశాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట మరోమారు గొడవ జరగడంతో హరిత తల్లి ఇంటికి వచ్చి సర్దిచెప్పింది. ఆనందరెడ్డి కోపంగా బట్టలు సర్దుకుని వెళ్లిపోవడంతో కూతురితోనే పడుకుని ఉదయాన్నే ఇంటికెళ్లింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే హరిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సాయంత్రం సమయంలో మృతదేహాన్ని అప్పగించడంతో అదే రోజు రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కోడలి మరణం మామ రామిరెడ్డిని కుంగదీసింది. ఒకే ఊరి వారు కావడంతో అవమానభారంతో కుమిలిపోయాడు. Also Read: మరుసటి రోజు ఉదయాన్నే పొలానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడడంతో ఉరికి వేలాడుతూ కనిపించాడు. కోడలు ఆత్మహత్య చేసుకుందన్న అవమాన భారంతో వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. డ్రిప్ పైపులతో మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆనందరెడ్డి తిరిగి రాకపోవడంతో చిన్నకొడుకు తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. Read Also:


By October 24, 2020 at 09:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-commits-suicide-after-daughter-in-laws-death-in-chittoor/articleshow/78840234.cms

No comments