Breaking News

బాలికను గ్యాంగ్ రేప్ చేసి.. నోట్లో గడ్డిమందు పోసిన కీచకులు.. కర్నూలులో దారుణం


కర్నూలులో అమానుష ఘటన వెలుగుచూసింది. తొమ్మిదో తరగతి బాలికను సామూహికంగా అత్యాచారం చేసి పురుగుల మందు తాగించి హత్య చేసేందుకు ప్రయత్నించిన అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు పొలం వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగి ఉన్నబాలికపై దుర్మార్గులు కీచకపర్వానికి దిగారు. జిల్లాలోని దేవనకొండ మండలం ప్యాలకుర్తి గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బాలిక(15) సమీపంలోని ఓ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పాఠశాలలు ఇంకా తెరుచుకోకపోవడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు పొలం వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే అదనుగా భావించిన గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారు. అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. బాలికపై మృగాల్లా పడి పశువాంఛ తీర్చుకున్నారు. Also Read: పక్కింటి బాలుడు ఆ దారుణాన్ని చూసి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఆమె ఎవరికైనా చెబుతుందేమోనని ఘాతుకానికి తెగబడ్డారు. బాధితురాలి గొంతులో గడ్డిమందు పోసి అక్కడి నుంచి పారిపోయారు. తల్లిదండ్రులు ఇంటికొచ్చేసరికి కూతురు అపస్మారక స్థితిలో పడి ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనపై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. Read Also:


By October 24, 2020 at 10:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/three-youth-trying-to-kill-minor-girl-after-gangrape-in-kurnool/articleshow/78840454.cms

No comments