Breaking News

రోజూ వచ్చే లారీడ్రైవర్‌తో సహజీవనం.. చివరికి దారుణం


ప్రియురాలితో చేస్తున్న లారీ డ్రైవర్ అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. మనస్పర్థల కారణంగా తన నుంచి విడిపోయిన ప్రియురాలు మరొకరితో సన్నిహితంగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు. ఆమెను గొంతుకోసి కిరాతకంగా చంపేసి పరారయ్యాడు. నిందితుడి ఆచూకీ కనుగొన్న పోలీసులు అరెస్టు చేసి కటకటాలవెనక్కి నెట్టారు. కడపలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు.. జిల్లా మద్దినారకి చెందిన లారీ డ్రైవర్ ఉడుముల రామాంజి అలియాస్ అంజి నిత్యం తాడిపత్రి నుంచి చెన్నై లోడుతో వెళ్లేవాడు. ఈ క్రమంలో అతని బీడీ నగర్‌కి చెందిన దస్తగిరమ్మ అలియాస్ లక్ష్మితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అనంతరం ఇద్దరూ కడపలోనే ఒకే ఇంట్లో సహజీవనం మొదలుపెట్టారు. అయితే కొద్దికాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. Also Read: తన నుంచి విడిపోయిన ప్రియురాలు మరొక లారీ డ్రైవర్‌‌తో సన్నిహితంగా ఉంటోందని భావించిన అంజి.. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 3 వ తేదీన మాయమాటలు చెప్పి ప్రియురాలిని జేఎంజే కాలేజ్ వద్దకు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసేశాడు. ప్రియురాలిని దారుణంగా చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని కడపలో అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. Read Also:


By October 07, 2020 at 12:03PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-murdered-by-boyfriend-in-kadapa-arrested/articleshow/78529212.cms

No comments