Breaking News

Pawan Kalyan: కుప్పంలో దుర్ఘటన.. రామ్ చరణ్, అల్లు అర్జున్ సాయంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్


బర్త్ డే వేడుకల్లో భాగంగా భారీ కటౌట్ కడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషాద ఘటన యావత్ పవన్ అభిమాన వర్గాలను కలచివేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ప‌వ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ చనిపోయిన మృతుల కుటుంబాలకు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, వ‌రుణ్ తేజ్ సైతం ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి చేశారు. ఆ వెంటనే పెద్ద మనసు చేసుకొని మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించగా.. ఒక్కో కుటుంబానికి రెండున్న లక్షల చొప్పున సాయం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పవన్‌తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు మృతుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఆర్ధిక సాయం ప్రకటించి వారిని ఆదుకునే ప్రయత్నంలో భాగమయ్యారు. అయితే తాజాగా రామ్ చరణ్, అల్లు అర్జున్ అందించిన సాయంపై రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్.. ''కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రామ్ చరణ్‌కి అలాగే పెద్ద మనుసుతో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్‌, నిర్మాతలు శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం, మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు నా కృతజ్ఞతలు'' అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే కుప్పం దుర్ఘటనపై మాధవీలత రియాక్ట్ అయిన తీరు జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపై మీరు అభిమానించే హీరోలకు ఫ్లెక్సీలు కట్టొద్దని, ఆ డబ్బుతో పేదవారికి సాయం చేయండని పేర్కొంటూ ఫ్యాన్స్ ఇలాంటి ప్రమాదరకమైన పరిస్థితులు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండని ఆమె తెలిపింది.


By September 03, 2020 at 11:44AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-reaction-on-ram-charan-allu-arjun-help/articleshow/77905388.cms

No comments