Breaking News

Drugs Case:డ్రగ్స్ కేసులో ఛీటింగ్.. యూరిన్ శాంపిల్స్‌లో వాటర్ కలిపిన సినీ నటి! అసలేం జరుగుతోంది..?


ప్రస్తుతం బాలీవుడ్ సహా శాండిల్‌వుడ్‌లలో డ్రగ్స్ రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు బాలీవుడ్‌లో డ్రగ్స్ కోణంపై నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు అధికారులు లోతైన విచారణ చేపడుతుండగా.. మరోవైపు కన్నడ సినీ పరిశ్రమకు డ్రగ్స్ రాకెట్‌తో ఉన్న సంబంధాలు వెలికితీసే పనిలో ఉన్నారు సెంట్రల్ క్రైమ్ బ్రాంబ్ ఆఫీసర్స్. ఈ క్రమంలో ఇప్పటికే హీరోయిన్లు , రాగిణి ద్వివేదిలను సెంట్రల్ క్రైమ్ బ్రాంబ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో భగంగా డోప్ టెస్టు నిమిత్తం వీరిని బెంగ‌ళూరులోని కేపీ జ‌న‌ర‌ల్‌ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ డోప్ టెస్టు ఇచ్చిన యూరిన్ శాంపిల్‌లో రాగిణి ఛీటింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. తన యూరిన్ శాంపిల్స్‌లో ఎవ్వరికీ అనుమానం రాకుండా వాటర్ మిక్స్ చేసి వైద్యులకు సమర్పించిందట రాగిణి. అయితే టెస్ట్ నిమిత్తం ల్యాబ్‌లో జరిగిన పరీక్షల్లో యూరిన్ శాంపిల్‌లో నీరు ఉండటాన్ని గుర్తించిన వైద్యులు.. రాగిణి నుంచి మరోసారి యూరిన్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తున్నారని సమాచారం. Also Read: మరోవైపు హీరోయిన్ సంజన సైతం డోప్ టెస్టును నిరాకరిస్తూ ఆసుపత్రిలో నానా రచ్చ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని, డోప్ టెస్ట్‌కు అంగీకరించాల్సిన అవసరం తనకు లేదని వాదిస్తూ ఆసుపత్రిలోనే పోలీసులతో వాగ్వాదానికి దిగింది సంజన. దీంతో డ్రగ్స్ కేసు ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులతో సంజనకు సబంధాలున్నాయని, ఆమె రెగ్యులర్‌గా రేవ్ పార్టీల్లో పాల్గొంటూ డ్రగ్స్ వాడుతుందనే విషయం మాదక ద్రవ్యాల సరఫరా దారులు వీరేన్ ఖన్నా, రాహుల్‌‌లను విచారణ చేయగా బయటపడిందని పోలీసులు అంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ డ్రగ్స్ కలకలం పెను సంచలనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.


By September 13, 2020 at 09:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/drugs-case-ragini-dwivedi-cheating-on-her-dope-test/articleshow/78085486.cms

No comments