ముంచేసిన పత్తి.. కుంగదీసిన కూతురి అనారోగ్యం.. అనంతపురంలో యువ దంపతుల ఆత్మహత్య

తన ఇంట సిరులు కురిపిస్తుందనుకున్న పత్తి ఆ రైతును చిత్తుచేసింది. సాగు ఖర్చులకు తెచ్చిన అప్పులు మాత్రం ఏటికేడు కొండలా పెరిగిపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అదే సమయంలో కూతురి అనారోగ్యం మరింత కుంగదీసింది. వైద్యం కోసం మరికొన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. ఒకదానికొకటి కలుపుకుని వడ్డీల ఊబిలో కూరుకుపోయాడు. తీర్చలేనంత బాకీపడిపోయాడు. ఏం చేయాలో పాలుపోక ఆ యువరైతు భార్యతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ అత్యంత విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన బయపరెడ్డి(27) తన ఏడెకరాల్లో పత్తి సాగు చేసేవాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరుసగా పంట చేతికందకపోవడంతో నష్టాలు చవిచూశాడు. సాగు కోసం తెచ్చిన అప్పులు అమాంతం పెరిగిపోయాయి. ఇంతలోనే తన చిన్నారి కూతురు పూజిత అనారోగ్యం బారిన పడడంతో వైద్యం కోసం మరికొన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. బ్యాంకులో కట్టాల్సిన రూ.4 లక్షలు, బయట వ్యక్తుల వద్ద సుమారు రూ.11 లక్షలు తీర్చలేక అఘాయిత్యానికి పాల్పడ్డాడు. Also Read: తన భార్య అనసూయ(25)తో సహా ఆత్మహత్యా యత్నం చేశాడు. పురుగుల మందు తాగి భార్యాభర్తలు బలవన్మరణానికి యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పామిడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అనసూయ ప్రాణాలు విడిచింది. బయపరెడ్డి పరిస్థితి విషమించడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో మూడేళ్ల కొడుకు, ఏడాదిన్నర కూతురు అనాథలుగా మిగిలారు. అప్పుల బాధ తాళలేక యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. Read Also:
By September 12, 2020 at 09:39AM
No comments