Breaking News

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఏసీ కోచ్‌లుగా జనరల్, స్లీపర్ కోచ్‌లు!


భారతీయ రైల్వే మరింత ఆధునికతను అందిపుచ్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కోచ్‌లను అప్‌గ్రేడ్‌ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ కోచ్‌లను ఏసీ కోచ్‌లుగా మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్‌గ్రేడ్‌ చేసిన స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ను ఎకానమీ 3 టైర్‌ ఏసీ క్లాస్‌ లేదా 3 టైర్‌ టూరిస్ట్‌ క్లాస్‌గా పిలుస్తారు. ప్రస్తుతమున్న త్రీ టైర్‌ ఏసీ క్లాస్‌కు, ఏసీ స్లీపర్‌ క్లాస్‌కు ఇది మధ్యస్థంగా ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇప్పటికే కపుర్తలా రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి ఆదేశాలు అందినట్టు సమాచారం. ప్రస్తుతం స్లీపర్ క్లాస్ కోచ్‌లో ఉన్న 72 బెర్తులకు బదులు 83 బెర్తులతో 3 టైర్‌ ఏసీ టూరిస్ట్‌ క్లాస్‌గా మార్చనున్నారని తెలుస్తోంది. తొలి దశలో దాదాపు 230 కోచ్‌లను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పుడున్న త్రీ టైర్‌ ఏసీ క్లాస్‌ కోచ్‌ తయారు కంటే ఏసీ త్రీ టైర్ టూరిస్ట్ క్లాస్ కోచ్‌కు 10 శాతం అదనంగా ఖర్చు అవుతుంది. ఒక్కో కోచ్‌‌ కోసం దాదాపు రూ.2.8 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. బెర్తుల సంఖ్య పెరగడం వల్ల డిమాండ్‌ బాగానే ఉండి ఆదాయం వస్తుందని రైల్వే భావిస్తోంది. అన్‌-రిజర్వ్‌డ్‌ జనరల్‌ కోచ్‌లను కూడా 100 సీట్లు కలిగిన ఏసీ క్లాస్‌ కోచ్‌గా మార్పు చేయనున్నట్లు సమాచారం. అయితే జనరల్‌ కోచ్‌ల డిజైన్‌ తుది దశలో ఉందని, ఒక్కోదాన్నిి 105 సీట్ల సామర్థ్యంతో తయారు చేయించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కోచ్‌లలో సీట్ల సంఖ్యను పెంచడం వల్ల ప్రయాణీకులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. యూపీఏ హాయంలో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సైడ్ మిడిల్ బెర్త్‌ను ప్రవేశపెట్టారు. దీని వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురైనట్టు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో తొలగించాల్సి వచ్చింది. అయితే, ఎలక్ట్రికల్ యూనిట్లను మార్చడం, కొన్ని వస్తువులను నిల్వ చేయడానికి కంపార్ట్‌మెంట్‌ను తొలగించడం ద్వారా కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఎసి 3-టైర్ క్లాస్‌లో ఎక్కువ స్థలం ఉంటుందని అధికారులు అంటున్నారు.


By September 10, 2020 at 06:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-railways-to-upgrade-sleeper-and-general-class-coaches-to-ac-coaches/articleshow/78029638.cms

No comments