Breaking News

కాలయముడైన భర్త... పింఛన్‌ డబ్బులు ఇవ్వలేదని భార్యను కత్తితో నరికి హత్య


అగ్ని సాక్షిగా తాళికట్టి కష్టసుఖాల్లో కడవరకూ తోడుంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. మద్యానికి బానిసై భార్యకు వచ్చే వికలాంగ పెన్షన్‌ డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. కుటుంబ పోషణకు ఆసరాగా ఉండే ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో భార్యను కత్తితో నరికి కిరాతకంగా చంపేశాడు. మండలం సీతారామపురం సౌత్‌కు చెందిన కంబాల విజయలక్ష్మి(42)కి రుస్తుంబాదకు చెందిన గన్నాబత్తుల వీరవెంకట దుర్గారావు(దొరబాబు)తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు శ్రావ్య, హర్షవర్ధన్‌ ఉన్నారు. Also Read: విజయలక్ష్మి దివ్యాంగురాలు కావడంతో ప్రభుత్వం నుంచి నెలనెలా పెన్షన్ వస్తోంది. కొంతకాలంగా మద్యానికి బానిసైన దొరబాబు పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ భార్యను వేధిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కూతురు శ్రావ్య తల్లి వద్ద కూర్చొని చదువుకుంటుండగా దొరబాబు పెన్షన్ డబ్బుల కోసం ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన దొరబాబు కత్తితో విజయలక్ష్మిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై నరసాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By September 02, 2020 at 09:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-brutally-kills-his-wife-in-west-godavari-over-pension-issue/articleshow/77882792.cms

No comments