Breaking News

అంత్యక్రియలు పూర్తయ్యాక అనుమానం.! ఆరా తీస్తే దారుణం వెలుగులోకి..


వాకింగ్‌కి వెళ్లిన రిటైర్డ్ టీచర్ గుండెపోటుతో చనిపోయాడని అంతా భావించారు. అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. రోజూ యాక్టివ్‌గా ఉండే ఆయనకు సడెన్‌గా గుండెపోటుతో చనిపోవడమేంటి? అసలు ఆయన పడిపోయిన చోట ఏం జరిగింది? అని అనుమానాలు తలెత్తాయి. కుటుంబ సభ్యులు ఆయన కింద పడిపోయిన చోటుకెళ్లి ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆయన చనిపోయింది గుండెపోటుతో కాదు.. బైక్‌తో గుద్దడంతో చనిపోయారని తేలడంతో షాకయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ షాకింగ్ ఘటన జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని మాచర్లకు చెందిన రిటైర్డ్ టీచర్, రచయిత శివప్రసాద్(65) ఈ నెల 12 వతేదీన వాకింగ్‌కి వెళ్లారు. కొద్దిసేపటికి ఆయన రోడ్డు పక్కన పడిపోయి ఉన్నారని కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. గుండెపోటు వచ్చి ఉంటుందని భావించి వెంటనే ఆయనను గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయల్దేరారు. కొద్దిసేపటికే ఆయన ప్రాణాలు విడిచారు. గుండెపోటుగా భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపించేశారు. ప్రతిరోజూ ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన గుండెపోటుతో చనిపోవడమేంటని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆయన పడిపోయిన చోటుకెళ్లి ఆరా తీయడంతో షాకింగ్ విషయం తెలిసింది. సమీపంలోని పెట్రోల్ బంకులో ఉన్న ఫుటేజీ చూసి నిర్ఘాంతపోయారు. వెనక నుంచి వేగంగా వచ్చిన బైక్ ఆయన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా కిందపడిపోయాడు. వెంటనే లేని తన బైక్ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించిన దృశ్యాలు రికార్డయ్యాయి. Also Read: గుండెపోటుతో మరణించలేదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. జరిగినా చుట్టుపక్కల ఉన్న వారు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని సీఐ తెలిపారు. Read Also:


By September 20, 2020 at 09:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/cctv-footage-revealed-shocking-facts-in-retired-teacher-death-in-guntur/articleshow/78213371.cms

No comments