Breaking News

శ్రీకాకుళం: మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం.. గర్భం దాల్చిన అభాగ్యురాలు


ఎన్ని శిక్షలు పడినా కామాంధుల తీరులో మార్పులు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి నిత్యం ఎక్కడో చోట అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ కోవలోనే మానసిక వికలాంగురాలైన ఓ యువతిపై దుండగులు పైశాచికత్వానికి పాల్పడ్డారు. ఆమెను లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడటంతో అభాగ్యురాలు గర్భం దాల్చింది. ఈ దారుణ ఘటన జిల్లా మండలంలో సోమవారం వెలుగుచూసింది. Also Read: పొత్తంగి గ్రామానికి చెందిన యువతి(28) పుట్టుకతోనే మానసిక దివ్యాంగురాలు. పేద కుటుంబానికి చెందిన ఆమెకు మాటలు కూడా రావు. ఐదేళ్ల కిందట తండ్రి, రెండేళ్ల కిందట తల్లి అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో ఆమె ఒంటరైన ఆమెకు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షనే ఆధారం. పూటకొకకు పెట్టే అన్నం తింటూ తన పూరింట్లోనే కాలం వెళ్లదీస్తోంది. కరోనా నేపథ్యంలో గ్రామ వాలంటీర్, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు జ్వరాలపై సోమవారం ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ క్రమంలోనే ఆశ కార్యకర్తలు ఆ యువతిని పరీక్షించగా ఐదు నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. Also Read: ఇంత జరిగినా తనకేమైందో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను చూసి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిపురం పీహెచ్‌సీ వైద్య సిబ్బంది బాధితురాలికి వైద్య పరీక్షలు చేసి రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆమెకు నెలలు నిండినా ప్రసవం కష్టతరమవుతుందని డాక్టర్లు చెబుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Also Read:


By September 08, 2020 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mentally-challendged-woman-raped-by-unidentified-men-in-srikakulam/articleshow/77989191.cms

No comments