Breaking News

అల్లుడి హత్యకు స్కెచ్ వేసిన అత్త.. భార్య జల్సాలకు అడ్డొస్తున్నాడని దారుణం


తన సరదాలకు, అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను కుటుంబసభ్యులు, బంధువుల సాయంతో దారుణంగా చంపేసిందో మహిళ. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తన భర్త రోడ్డుప్రమాదంలో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోస్టుమార్టం రిపోర్టులో అతడిని యాక్సిడెంట్ కాదు హత్య అని తేలడంతో భార్య సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. Also Read: తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లా అంబూర్ సమీపంలోని అలంగుప్పం ప్రాంతానికి చెందిన రమేష్‌బాబు పదేళ్ల క్రితం జయంతిమాల అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. రమేష్ విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తుండగా, జయంతిమాల అంబూరులోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల ఉద్యోగం మానేసిన రమేష్ సమాజసేవలో మునిగి తేలుతూనే చిన్నచిన్న కాంట్రాక్టులు చేస్తున్నాడు. మరోవైపు జయంతిమాల సోలూర్ ప్రాంతంలో ఇటీవల కొత్తగా నిర్మించిన హాస్పిటల్‌లో ఉద్యోగంలో చేరింది. Also Read: కొత్త హాస్పిటల్‌ చేరినప్పటి నుంచి జయంతిమాల ప్రవర్తనలో పెనుమార్పులు రావడాన్ని భర్త గమనించాడు. డ్యూటీ ముగిసిన తర్వాత కూడా చాలాసేపటి వరకు ఇంటికి రాకపోవడం, పిల్లలను కూడా పట్టించుకోకుండా పరాయి మగాళ్లతో ఛాటింగ్‌లు చేస్తూ, ఫోన్లో మాట్లాడుతూ కాలక్షేపం చేసేది. ఈ విషయాన్ని రమేష్ నిలదీయడంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం రాత్రి 8 గంటల ఇంటికొచ్చిన జయంతిమాల, తిరిగి 10 గంటల సమయంలో తనకు డ్యూటీ ఉందని చెప్పి బయటకు బయలుదేరింది. Also Read: దీంతో కోపం తెచ్చుకున్న రమేష్ ఇది హాస్టల్ లేక గెస్ట్‌హౌస్ అనుకున్నావా? విజిటింగ్ చేసి వెళ్లడానికి అంటూ నిలదీశాడు. ఇంటిని, పిల్లలను అసలు పట్టించుకుంటున్నావా? నీకు నీ సరదాలే ముఖ్యమైపోయాయంటూ ప్రశ్నించాడు. దీంతో తన సరదాలకు అడ్డం పడుతున్న భర్తను అడ్డు తొలగించుకుంటే ఆస్తితో పాటు ఇన్యూరెన్స్ డబ్బులు కూడా వస్తాయని ప్లాన్ వేసింది. ఇదే విషయాన్ని తన తల్లి సరస్వతికి చెప్పగా.. అడ్డు చెప్పాల్సిన ఆమె అల్లుడి హత్యకు పక్కా స్కెచ్ వేసింది. వీరిద్దరు తమ బంధువైన రామ్‌ అనే వ్యక్తిని సంప్రదించగా.. అతడు తన ఫ్రెండ్స్ ధనుష్, విఘ్నేష్, గౌతమ్‌లతో రంగంలోకి దిగాడు. Also Read: తమకు సాయం చేస్తే పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెపుతామని రమేష్ స్నేహితుడు మనోహరన్‌ను ట్రాప్ చేశారు. వీరంతా కలిసి జులై నెలలో తిరుపత్తూర్ జాతీయ రహదారిపై యాక్సిడెంట్ చేసి చంపేందుకు యత్నించారు. ఈ ఘటనలో గాయాలతో బయటపడిన బాధితుడు పోలీస్ కేసు పెట్టేందుకు సిద్ధం కాగా వద్దని స్నేహితులు వారించారు. ఆగస్ట్ 27వ తేదీన మనోహరన్‌ మందు పార్టీ పేరుతో రమేష్‌ను ఓ ఫామ్‌హౌస్‌కి తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అతడిని రామ్, విఘ్నేష్, గౌతమ్ కలిసి ఇనుప రాడ్లతో తలపై కొట్టి చంపేశారు. శవాన్ని హైవే మీదికి రోడ్డుప్రమాదంలో చనిపోయాడని చిత్రీకరించారు. Also Read: దీనిపై కేసు నమోదు చేసిన అంబూరు పోలీసులు రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. రిపోర్టులో రమేష్‌ తలపై ఇనుప రాడ్లతో కొట్టి చంపేసినట్లు తేలడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రమేష్‌ ఫోన్లో చివరిగా తన ఫ్రెండ్ మనోహరన్‌తో మాట్లాడినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు మృతుడి భార్య జయంతిమాల, అత్త సరస్వతి సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. Also Read:


By September 04, 2020 at 10:16AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-murdered-in-tamil-nadu-over-wife-illegal-affairs-police-arrests-6-accused/articleshow/77924300.cms

No comments