Breaking News

మనసు చంపుకోలేక ప్రాణాలే వదిలేసింది.. నెల్లూరులో విషాదం


తాను ప్రేమించిన వ్యక్తిని కాదని తల్లిదండ్రులు మరొకరితో పెళ్లి నిశ్చయించారన్న మనస్థాపంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్‌కి చెందిన బాలిక తొమ్మిదో తరగతి వరకూ చదువుకుని ఇంటివద్దే ఉంటోంది. ఆమె అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. అతనితో కూతురు చనువుగా ఉండడం గమనించిన ఆమె తల్లిదండ్రులు బాలికను కొద్దికాలం తమ బంధువుల ఇంటికి పంపించారు. ఇటీవల తిరిగొచ్చిన బాలికకు పేరెంట్స్ మరొకరితో వివాహం నిశ్చయం చేసేశారు. నిశ్చితార్థం కూడా జరగడంతో తన ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదని బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. ప్రేమించిన వ్యక్తిని విడిచి బతకలేక.. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక బాలిక మానసికంగా కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడింది. స్నానానికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి బాత్రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకుంది. బాత్రూమ్ పైన రాడ్డుకి చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళుతుందనుకున్న కూతురు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. ఇష్టం లేని పెళ్లి ఇంత పనిచేస్తుందని ఊహించలేకపోయారు. కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. Read Also: Also Read:


By September 10, 2020 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/girl-commits-suicide-over-love-affair-in-nellore-district/articleshow/78031165.cms

No comments