Breaking News

చికెన్ బిర్యానీ ఐదు పైసలే.. ఎగబడిన జనం


బిర్యానీ అంటే చాలామంది భోజన ప్రియులు పడిసస్తారు. ఇక చికెన్, మటన్ నాన్ వెజ్ బిర్యానీ అంటే లొట్టలేసుకొని తింటారు. బిర్యానీకి ఉన్న ఈ క్రేజ్‌తో చాలామంది వ్యాపారులు ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంద రూపాయలు, యాభై రూపాయలు, పదిరూపాలయకే బిర్యానీ అంటూ ఇప్పటివరకు రకరకాల ఆఫర్ల గురించి విన్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఐదు పైసలకు బిర్యానీ దొరుకుతుంది. రాష్ట్రంలో ఓ హోటల్లో ఐదు పైసలకే విక్రయిస్తున్నట్లు ప్రకటన ఇవ్వడంతో జనం హోటల్ వద్దకు బారులు తీరారు. రామనాథపురంలో 5 పైసలుకు ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ దొరకుతుంది. దీంతో బిర్యానీ కోసం భోజనప్రియులు బారులు తీరారు. రామనాథపురం, కీళక్కరై, పనైకుళం ప్రాంతాల్లో అధికంగా బిర్యానీ దుకాణాలున్నాయి. ఆ ప్రాంతాల్లో వెళ్తుంటే బిర్యానీ వాసన నోరూరిస్తుంటుంది. ఈ క్రమంలో, శుక్రవారం ఓ బిర్యానీ దుకాణంలో 5 పైసలకే ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ, పెరుగు పచ్చడి, వంకాయ కుర్మా అందిస్తున్నామనే ప్రకటనతో నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. 5 పైసలు చెల్లించి బిర్యానీ తీసుకెళ్లారు. Read More: ఈ విషయమై దుకాణ యజమాని ఫరత్‌ మాట్లాడుతూ... రామనాథపురం ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో కొత్త బిర్యానీ దుకాణాన్ని ప్రారంభించానని, మాంసాహారప్రియులను ఆకట్టుకొనేలా 5 పైసలకే ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ అందిస్తున్నట్టు ప్రకటించానన్నారు. అలాగే, పాత నాణేలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశం కూడా ఇందులో ఇమిడి ఉందన్నారు. ఐదు పైసల వినియోగి నిషేధించి ఏళ్లు డుస్తున్నా 150మంది వరకు 5 పైసలు చెల్లించి బిర్యానీ కొనుగోలు చేశారని ఫరత్‌ తెలిపారు.


By September 06, 2020 at 12:56PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/chicken-biryani-for-5-paisa-in-ramanadhapuram-at-tamilnadu/articleshow/77959254.cms

No comments