ప్రియుడి మోసం తట్టుకోలేక పెళ్లైన మహిళ ఆత్మహత్య.. చిత్తూరులో దారుణం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసిన కానిస్టేబుల్ మోజు తీరాక మోసం చేయడంతో వివాహిత చేసుకున్న ఘటన జిల్లాలో జరిగింది. మదనపల్లెకి చెందిన సుగుణ(34)కి ములకలచెరువు మండలం పెద్దయ్యగారిపల్లెకి చెందిన రమణారెడ్డితో వివాహమైంది. పెళ్లైన కొన్నేళ్లకే భర్త వదిలేయడంతో ఆమె మదనపల్లెలోని గౌతమీనగర్లో బ్యూటీపార్లర్ పెట్టుకుని తన ఇద్దరు పిల్లలను చదివించుకుంటోంది. జైళ్ల శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కర్నూలుకి చెందిన చంద్రకాంత్ బదిలీపై వచ్చాడు. అతనితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లి చేసుకుంటానని సుగుణని నమ్మించిన కానిస్టేబుల్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. రోజులు గడచిపోతున్నా పెళ్లి ఊసెత్తకపోవడంతో సుగుణ ప్రియుడు చంద్రకాంత్ని నిలదీసింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావంటూ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: ఇటీవల మరో అమ్మాయితో చంద్రకాంత్కి పరిచయం ఉన్నట్లు సుగుణకి తెలిసిపోయింది. నంద్యాలకి చెందిన యువతితో ప్రియుడు ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలిసి నిలదీయడంతో మరోమారు గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన సుగుణ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అది గమనించిన ప్రియుడు తలుపులు తీసి ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. కానిస్టేబుల్ చంద్రకాంత్ మోసం చేయడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Read Also:
By September 11, 2020 at 10:46AM
No comments