Breaking News

గుడ్‌న్యూస్! రేపటి నుంచి మరో 80 కొత్త రైళ్లు.. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవి ఇవే..


కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‍డౌన్ తర్వాత రైల్వేశాఖ దేశంలోని ప్రధాన మార్గాల్లో 230 రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాతి నుంచి విడతల వారీగా రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నారు. గత మే 12 నుంచి 30 రాజధాని రైళ్లను, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పున:ప్రారంభించారు. ఇక సెప్టెంబర్ 12 శనివారం నుంచి దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లు నడవనున్నాయి. రైల్వే ప్రకటించిన ఈ 80 రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల గుండా వెళ్లనున్నాయి. వాటి వివరాలివీ.. తెలంగాణ మీదుగా.. * రైలు నెంబర్ 07007 సికింద్రాబాద్ నుంచి బిహార్‌లోని దర్భంగా వెళ్లనుంది. అ రైలు మంగళ, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు గురువారం, శుక్రవారం నడుస్తుంది. * హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని పర్భనీకి నడిచే ప్యాసింజర్ రైలు నెంబర్ 07563 రోజూ నడుస్తుంది. ఇది ప్రతి స్టేషన్‌లో ఆగుతుంది. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఇది మొదలవుతుంది. Also Read: ఏపీ మీదుగా.. * రైలు నెంబర్ 02663 హౌరా నుంచి తిరుచ్చిరాపల్లికి గురు, శనివారాల్లో ఉంటుంది. రైలు నెంబర్ 02664 తిరుచ్చిరాపల్లి నుంచి హౌరాకు మంగళవారం, శుక్రవారం నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. * బెంగళూరు నుంచి గువహటికి రైలు నెంబర్ 02509 అందుబాటులో ఉంటుంది. బుధ, గురు, శుక్రవారాలు నడుస్తుంది. రైలు నెంబర్ 02510 గువహటి నుంచి బెంగళూరుకు సోమవారం, మంగళవారం, ఆదివారం నడుస్తాయి. ఈ రైళ్లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖటప్నం విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. * ఛత్తీస్‌గఢ్ నుంచి విశాఖపట్నానికి నడిచే రైలు నెంబర్ 08517. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు రోజూ సాయంత్రం 4.10 గంటలకు ప్రారంభమవుతుంది. రైలు నెంబర్ 08518 విశాఖపట్నం నుంచి కోర్బాకు రోజూ రాత్రి 8.05 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఇది ఏపీలోని విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. * చెన్నై నుంచి న్యూఢిల్లీకి రైలు నెంబర్ 02615 నడుస్తుంది. న్యూఢిల్లీ నుంచి చెన్నైకి రైలు నెంబరు 02616. ఈ సర్వీసు ప్రతి రోజు ఉండనుంది. ఈ రైలు ఏపీలోని విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. * చెన్నై నుంచి బిహార్‌లోని ఛాప్రాకు రైలు నెంబర్ 02669 సర్వీసు ఉంది. ఇది సోమవారం, శనివారం అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 02670 ఛాప్రా నుంచి చెన్నైకి సోమవారం, బుధవారం నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఏపీ, తెలంగాణ మీదుగా..* ఒడిశాలోని ఖుర్దారోడ్ జంక్షన్ నుంచి గుజరాత్‌లోని ఓఖాకు రైలు నెంబర్ 08401 ప్రతి ఆదివారం ఉంటుంది. మధ్యాహ్నం 1.55 గంటలకు ఖుర్దారోడ్ నుంచి ఇది బయల్దేరుతుంది. రైలు నెంబర్ 08402 ప్రతి బుధవారం ఉదయం 8.30 గంటలకు ఓఖా నుంచి ప్రారంభం అవుతుంది. శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లలో ఇది ఆగుతుంది. Must Read: Also Read:


By September 11, 2020 at 10:36AM


Read More https://telugu.samayam.com/telangana/news/indian-railways-restarts-another-80-trains-in-the-country-after-lockdown/articleshow/78052731.cms

No comments