Breaking News

మరో దేశంలో అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్.. తొలి డోస్ వేసుకున్న ఆరోగ్య మంత్రి


మొదలైన నాటి నుంచి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు కరువయ్యింది. మహమ్మారి మొదలై తొమ్మిది నెలలు గడుస్తా విజృంభణ ఏ మాత్రం తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్-19కు వ్యాక్సిన్ కోసం ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు అభివృద్ధి చేసిన టీకాల మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అయితే, మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే, వ్యాక్సిన్‌ను రష్య అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా, మరో దేశం కూడా అదే బాటలో పయనిస్తోంది. మూడో దశ ప్రయోగాలు కొనసాగుతుండగానే టీకాను యూఏఈ అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న యోధులకు టీకా అందజేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తొలి విడత వ్యాక్సిన్ డోస్ అందుబాటులోకి వచ్చింది. యూఏఈ ఆరోగ్య శాఖ మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్ వ్యాక్సిన్ తొలి డోస్‌ను తీసున్నారు. టీకా తీసుకున్న తర్వాత తనకు ఎటువంటి దుష్ప్రభావాలు సంభవించలేదని, ఈ కారణంగానే తాను డోస్ తీసుకున్నానని ఆయన వెల్లడించారు. దేశ ప్రజలను రక్షించడంలో తాము ముందుంటామని, ఈ వ్యాక్సిన్‌ను కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ముందుగా ఇస్తామని అన్నారు. అబూదాబిలో కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీకాను అక్కడ ఉన్న 125 దేశాలకు చెందిన 31వేల మంది పౌరులపై ప్రయోగించి, ఫలితాలను వైద్యాధికారులు సమీక్షిస్తున్నారు. ఇక, గడచిన 24 గంటల్లో తొలిసారి లక్ష మందికిపైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. అక్కడ ఒక్క రోజులోనే లక్షకుపైగా పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. కొత్తగా 809 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ఇప్పటి వరకు 1,50,000 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి వివాహ వేడుక నిర్వహిస్తోన్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేడుకకు 10 మందికి మించి అతిథులు హాజరుకాకుడదనే నిబంధన కొనసాగుతోంది.


By September 20, 2020 at 12:48PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/uae-health-minister-abdulrahman-al-owaistakes-countrys-first-dose-of-covid-19-vaccine/articleshow/78214873.cms

No comments