Breaking News

టీచర్ల టాయిలెట్‌లో సీక్రెట్ కెమెరాలు.. ఆ వీడియోలు చూపించి..


విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే దారితప్పారు. సాటి మహిళా ఉపాధ్యాయులతో నీచానికి దిగారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ అత్యంత దిగజారి ప్రవర్తించారు. కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయిన లేడీ టీచర్లు జీతం ఇవ్వమని అడిగినందుకు కీచకపర్వం సృష్టించారు. టీచర్ల టాయిలెట్‌ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కి దిగారు. తమ కోరిక తీర్చాలంటూ స్కూల్ సెక్రటరీ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన యూపీలోని మీరట్‌లో జరిగింది. నగరంలోని సర్దార్ బజార్ రిషబ్ అకాడమీ స్కూల్ సెక్రటరీ రంజిత్ జైన్, అతని కొడుకు అభినవ్‌ జైన్ నీచానికి పాల్పడ్డారు. కరోనా కారణంగా స్కూల్ మూతపడి జీతాల్లేక అల్లాడుతున్న లేడీ టీచర్లపై అకృత్యాలకు ఒడిగట్టారు. జీతాలు చెల్లించాలని అడిగినందుకు టీచర్ల టాయిలెట్‌లలో ఏర్పాటు చేశారు. టీచర్ల ప్రైవేట్ దృశ్యాలను షూట్ చేసి నీచంగా బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. Also Read: జీతం అడిగిన టీచర్‌ని పిలిపించి ఆమె వీడియోలు చూపించి వేధించడం మొదలుపెట్టారు. తమతో చనువుగా ఉండాలంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఇబ్బందులకు గురిచేశారు. దీంతో విసిగిపోయిన టీచర్లు స్కూల్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. టాయిలెట్ వీడియోలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తమతో చనువుగా ఉండాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారని లేడీ టీచర్లు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. Read Also:


By September 22, 2020 at 02:42PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/school-secretary-filmed-teachers-with-secret-cameras-in-toilets/articleshow/78252985.cms

No comments