Breaking News

రాధేశ్యామ్ చిత్రానికి అదే అతిపెద్ద ఆకర్షణ.. రాధాక్రిష్ణ కుమార్..


బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన ప్రభాస్, తన తర్వాతి చిత్రంగా యాక్షన్ మూవీ సాహోని ఎంచుకున్నాడు. ఐతే ఈ చిత్రం నేషనల్ లెవెల్లో ఒక్కోచోట ఒక్కోలా రెస్పాన్స్ అందుకుంది. సాహో తర్వాత అందరికీ కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న పూర్తి ప్రేమ కథా చిత్రం ఇదే. జిల్ చిత్ర దర్శకుడు రాధాక్రిష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

రాధేశ్యామ్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుందని తెలిసిందే. యూరప్ ప్రాంత నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్ స్టోరీపై దర్శకుడు రాధాక్రిష్ణ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేసాడు. ప్రభాస్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అనీ, వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అన్నాడు. ఇంకా రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ లుక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపాడు. ప్రభాస్ స్క్రీన్ ప్రెసెన్స్, లుక్స్ సినిమాకి పెద్ద అసెట్ అవుతుందనట్వీట్ చేసాడు. 



By September 08, 2020 at 01:00AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/52481/prabhas.html

No comments