కృష్ణా జిల్లా: దళిత యువతితో ప్రేమాయణం.. కేసు పెట్టిందన్న కక్షతో ఇంటికి నిప్పు

ప్రేమించినప్పుడు ఆమె కులం అడ్డు రాలేదు. పెళ్లి చేసుకోవాలని కోరితే మాత్రం నువ్వు దళితురాలివంటూ మొహం చాటేశాడు. అంతటితో ఆగకుండా ఆమె కుటుంబం మొత్తాన్ని మట్టుబెట్టాలన్న కుట్రతో తెల్లవారుజామున ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా మండలంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. Also Read: మండలంలోని శ్రీహరిపురం శివారు ఐనంపూడికి చెందిన యువతి(20) నర్సింగ్ కోర్సు చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సాయిరెడ్డి అనే యువకుడు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఆమె గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు వాపసు తీసుకోకపోతే తమను ఊరి నుంచి బహిష్కరిస్తామంటూ కొందరు నేతలు బెదిరిస్తున్నారని కొద్దిరోజులు క్రితం బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులందరూ నిద్రపోతున్న సమయంలో దుండగులు వీరి ఇంటికి నిప్పు పెట్టారు. మంటల వేడికి నిద్రలేచిన కుటుంబసభ్యులందరూ వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనలో ఇంట్లోని నగదు, బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. తాము రాజీకి రాలేదన్న కక్షతోనే సాయిరెడ్డి తన వర్గంతో కలిసి తమ కుటుంబాన్ని చంపేందుకు కుట్ర పన్నాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. Also Read: దీనికి సంబంధించి శంకర్రెడ్డి, వీరంకి సత్యనారాయణ, వి.సాయి, సుమిత్, మంద సాయిరెడ్డిలపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధిత యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న గుడివాడ డీఎస్పీ సత్యానందం, రూరల్ సీఐ అబ్దుల్ నబీలు బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. Also Read:
By September 03, 2020 at 08:03AM
No comments