విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే అన్నదమ్ములు మృతి
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అమాంతం చెట్టుని ఢీకొట్టడంతో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ నాతవర - తాండవ కూడలి అగ్రహారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఒక్కసారిగా చెట్టును ఢీ కొట్టింది. కారులో ప్రమాణిస్తున్న అన్నదమ్ములిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. కారు చెట్టుని ఢీకొట్టిన వేగానికి మృతదేహం కారులో ఇరుక్కుపోయింది. మరొకరు కారులో నుంచి బయటపడి ప్రాణాలొదిలారు. గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ అత్యంత విషాదకర ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: Also Read:
By September 10, 2020 at 11:10AM
No comments