Breaking News

పక్కింటి అమ్మాయిని చంపేసిన స్కూల్ కుర్రాడు.. కారణం తెలిసి పోలీసులే షాక్


తొమ్మిదేళ్ల అమ్మాయిని స్కూల్ కుర్రాడు దారుణంగా హత్య చేయడం కలకలంరేపింది. రాళ్లతో తలపై కొట్టి చంపేశాడు.. ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికొచ్చాడు. అనుమానంతో పోలీసులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. అమ్మాయి హత్యకు ఆ కుర్రాడు చెప్పిన కారణం విని పోలీసులకే దిమ్మ తిరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సమీపంలో ఘటన జరిగింది. లసూడియా ప్రాంతంలో 11 ఏళ్ల కుర్రాడు నివాసం ఉంటున్నాడు. ఆ పక్కనే ఐదో తరగతి చదువుతున్న బాలిక ఉంది. ఇద్దరూ కలిసి రోజూ ఆన్‌లైన్ గేమ్స్ కూడా ఆడుకునేవారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ సమయం నుంచి ఇద్దరూ కలిసి గేమ్స్ ఆడుతుండగా.. ప్రతిసారీ బాలిక చేతిలో ఆ కుర్రాడు ఓడిపోడుతున్నాడు. దాన్ని పెద్ద అవమానంగా భావించాడు.. అప్పటి నుంచి బాలికపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో బాలిక సోమవారం కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు గాలించారు. తర్వాత కొందరు స్థానికులు కుర్రాడితో కలిసి బాలిక వెళ్లడాన్ని గమనించామని చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా.. డెడ్‌బాడీని గుర్తించారు. అనుమానంతో కుర్రాడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే జరిగిన ఘోరాన్ని చెప్పాడు. బాలికకు మాయ మాటలు చెప్పిన కుర్రాడు ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి రాళ్లతో తలపై కొట్టాడు. ఆమె పడిపోగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాత్రూమ్‌లో కూర్చుని గడి పెట్టుకున్నాడు.. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ గేమ్స్‌లో ఓడిపోవడమే కాదు.. ఆ కుర్రాడి పెంపుడు ఎలుకను కూడా బాలిక చంపేసిందన్న కోపం కూడా ఉందట. ఆ బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. గేమ్స్‌లో ఓడిపోవడాన్ని అవమానంగా భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు.. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకున్నాడు.


By September 08, 2020 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/11-years-boy-kills-fifth-class-girl-in-indore/articleshow/77990997.cms

No comments