Breaking News

మేకలు మేపేందుకు వెళ్లనంటున్న కూతురు.. ఆరా తీస్తే దారుణం వెలుగులోకి..


రోజూ మేకలను అడవికి తీసుకెళ్లి మేపుకొచ్చే కూతురు హఠాత్తుగా తాను వెళ్లనంటూ మొండికేసింది. రోజుల తరబడి వెళ్లనని గోల చేస్తుంవదవటే తల్లికి అనుమానం వచ్చి నెమ్మదిగా ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. మేకలు మేపేందుకు వెళ్లిన సమయంలో దుండగులు ఆమెను అడవిలోకి లాక్కెళ్లి సామూహిక చేసినట్లు తెలియడంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. హజరిబాగ్ ఏరియాలో నివసించే గిరిజన జాతుల్లో ఒకటైన బిర్హోర్ తెగకు చెందిన బాలిక(13)పై దుండగులు గ్యాంగ్ రేప్‌ చేసిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక అడవిలో మేకలు మేపుకునేందుకు వెళ్లిన సమయంలో సోను కుమార్, సందీప్ కుమార్ ఆమెను అడ్డగించారు. బలవంతంగా లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టారు. బాలికపై పశువుల్లా పడి కామవాంఛలు తీర్చుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగడంతో బాలిక భయపడిపోయింది. Also Read: అప్పటి నుంచి మేకలు మేపేందుకు వెళ్లనంటూ ఇంట్లో మొండికేయడం మొదలుపెట్టింది. కొద్దిరోజులు చూసినా బాలికలో మార్పు రాలేదు. అనుమానం వచ్చిన బాలిక తల్లి ఆమెను నెమ్మదిగా ఆరా తీయడంతో దారుణం బయటపడింది. గ్యాంగ్ ఘటన బయటపడింది. బాధితురాలి తల్లి వెంటనే బర్హి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం బాలికను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


By September 23, 2020 at 09:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/13-year-old-girl-gangraped-by-two-men-in-jharkhand/articleshow/78268024.cms

No comments