Breaking News

ఢిల్లీ: ‌‌స్టార్ హోటల్‌లో‌ టూరిస్ట్ గైడ్‌పై గ్యాంగ్ రేప్.. నిందితులకు సహకరించిన మహిళ!


ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఓ యువతికి తక్కువ రేటుకే బ్యాంకు లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి, హోటల్ గదికి పిలిపించి ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఓ మహిళ సహ ఆరుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. న్యూఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. టూరిస్ట్ గైడ్‌గా పనిచేసే ఓ మహిళ.. ఇండియా గేట్ సమీపంలోని ఫైవ్‌స్టార్ హోటల్‌లో తనపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ ఘటనలో ఓ మహిళ పాత్ర కూడా ఉన్నట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందన్నారు. ఢిల్లీలోని షేక్ సరాయి ప్రాంతానికి చెందిన మనోజ్ శర్మ అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడని, అతడిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. బాధితురాలిపై శుక్రవారం గ్యాంగ్ రేప్ జరగ్గా.. మర్నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిపై అత్యాచారం జరిగిన హోటల్ గదిని ఇద్దరు వ్యాపారవేత్తల బుక్ చేసినట్టు తెలుస్తోంది. ‘టూరిస్ట్ గైడ్‌గా, టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోన్న బాధితురాలికి డబ్బులు అవసరం పడటంతో తెలిసిన వ్యక్తులను రుణం ఇప్పించమని కోరింది. దీనిని ఆసరగా తీసుకున్న మనోజ్ శర్మ ఆమె ఫోన్‌చేసి.. తాను చెప్పిన చోటుకు వస్తే తక్కువ వడ్డీకే రుణం ఇప్పిస్తానని చెప్పాడు. నిందితుడు శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఫోన్ చేసి షాంగ్రీలా హోటల్‌కు రప్పించాడని, రుణం ఇచ్చేవారు ఓ గదిలో ఉన్నారని చెప్పి అక్కడకు తీసుకెళ్లి.. మరో నలుగురితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు’ అని డీసీపీ తెలిపారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత మనోజ్ శర్మ బాధితురాలిని తన వాహనంలోనే ఇంటి వద్ద దింపినట్టు తెలుస్తోంది. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ సహా మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.


By September 21, 2020 at 11:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tourist-guide-gang-raped-shangri-la-hotel-near-india-gate-in-delhi/articleshow/78228848.cms

No comments