కారుణ్య ఉద్యోగం ఘాతుకం.. సింగరేణి కార్మికుడిని కిరాతకంగా చంపేసిన భార్యాబిడ్డలు

కారుణ్య ఉద్యోగం ఓ వ్యక్తిని కుటుంబసభ్యులే కిరాతకంగా చంపేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. బెల్లంపల్లి మండలంలోని పాతబెల్లంపల్లికి చెందిన ముత్తె శంకర్ (57) సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా శంకర్ మూడునెలలుగా కుటుంబానికి దూరంగా మంచిర్యాలలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే చిన్న కుమార్తె స్వాతి కరోనా బారిన పడినట్లు, కుమారుడు శ్రావణ్కుమార్కు లక్షణాలున్నాయని ముత్తె శంకర్కు భార్య విజయ గురువారం ఫోన్ చేసి చెప్పంది. Also Read: దీంతో శంకర్ శుక్రవారం ఇంటికి వచ్చాడు. అదేరోజు రాత్రి ఇంట్లోనే నిద్రపోతున్న అతడిని భార్య, కుమార్తె, కుమారుడు కలిసి గొంతుకు వైరు బిగించి హత్యచేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతుడి మెడకు చీరను కట్టి వేలాడదీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబసభ్యులను తమదైన శైలిలో విచారించగా కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. కారుణ్య నియామకంతో కొడుక్కి ఉద్యోగం సాధించవచ్చన్న దురుద్దేశంతోనే శంకర్ను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శంకర్ చెల్లెలు రుక్మిణి ఫిర్యాదు మేరకు మృతుడి భార్య, కుమార్తె, కుమారుడిపై బెల్లంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 06, 2020 at 07:25AM
No comments