శిరోముండనం కేసు... కర్ణాటకలో చిక్కిన నూతన్నాయుడు, 18 వరకు రిమాండ్

దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్టయిన బిగ్బాస్ ఫేమ్ నూతన్నాయుడికి మెజిస్ట్రేట్ ఈ నెల 18వ వరకు రిమాండ్ విధించారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి నూతన్నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం శనివారం రాత్రి అక్కడి నుంచి విశాఖకు బయలుదేరారు. ఆదివారం ఉదయం నగరానికి చేరుకున్న పోలీసులు నూతన్నాయుడిని నేరుగా మెజిస్ట్రేట్ వద్దకు తీసకెళ్లి హాజరు పరిచారు. అతడికి ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో అనకాపల్లి సబ్జైలుకు తరలించారు. Also Read: శిరోముండనం కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి నిర్వాకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ కేసులో నూతన్ నాయుడు ప్రమేయం ఉన్నట్లుగా భావించిన పోలీసులు అతని పేరును ఎ8గా చేర్చారు. శిరోముండనం తర్వాత 8297987395 ఫోన్ నెంబరుతో రిటైర్ట్ ఐఎఎస్ పీవీ రమేష్ పేరును ఉపయోగించి డాక్టర్లను తప్పుదోవ పట్టించిన నూతన్నాయుడు ఇలా ఇంకా ఏ తరహా మోసాలకు పాల్పడిందీ తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఉడిపిలో అతడు అరెస్టయి 24 గంటలు గడవకముందే గాజువాక పీఎస్లో మరో కేసు నమోదు కావడం గమనార్హం. Also Read: గతంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతుండగా గాజువాక పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో నూతన్నాయుడు తాను మాజీ ఐఏఎస్ అధికారినని, అరెస్టయిన వ్యక్తిని వదిలేయమని గాజువాక సీఐకి ఫోన్ చేశాడు. అతడు ట్రాఫిక్ సీఐకి కాల్ ట్రాన్స్ఫర్ చేయగా అది సీఎంఓ ఆఫీస్ నెంబర్ కాదనేసరికి ఫోన్ కట్ చేసేశారు. దీనిపై గాజువాక పోలీసులు నూతన్నాయుడిపై కేసు నమోదు చేశారు. Also Read:
By September 06, 2020 at 10:11AM
No comments