Breaking News

ఒక హత్యకు ప్రతీకారంగా రెండు హత్యలు.. నల్గొండ జిల్లాలో దారుణం


జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. అనుముల మండలం హజారిగూడెం గ్రామంలో జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి అనే అన్నదమ్ములను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. వీరి మరో సోదరుడు హరిపై కూడా దాడికి యత్నించగా అతడు తృటిలో తప్పించుకున్నాడు. ముగ్గరు అన్నదమ్ములు ఏడాది క్రితం అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపగా ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. Also Read: జానపాటి హరి భార్యకు, హజారిగూడెంకు చెందిన ఓ యువకుడికి కొన్నాళ్ల పాటు అక్రమ సంబంధం కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు అన్నదమ్ములు ఏడాది క్రితం అతడిని దారుణంగా చంపేశారు. దీంతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన ముగ్గురు ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రపోతుండగా దుండగులు నరికి చంపేశారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. హరి తప్పించుకున్నాడు. Also Read: ఈ ఘటనతో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యకు గురైన యువకుడి తల్లి ప్రతీకారంగానే మరో ఇద్దరితో కలిసి ఈ జంట హత్యలకు పాల్పడినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By August 03, 2020 at 08:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-brothers-brutally-murdered-in-nalgonda-district/articleshow/77324239.cms

No comments