Breaking News

మరోసారి ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెెన్స్


భారత్‌లో కరోనా కేసులు రోజురోజకు పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే కరోనా విజృంభణ మరింత పెరిగిపోతుంది. దీంతో ఈ పరిస్థితుల్లో మరోసారి 9 రాష్ట్రాల సీఎంలతో నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు... అస్సోం, బీహార్‌, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, కేరళ సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ చేయనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉండటం, కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న కరోనా కేసులు ప్రభావం, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సహా పలు అంశాలపై మోదీ, ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. 9 రాష్ట్రాల్లో భాగంగా ఏపీ, తెలంగాణ సీఎంలతోనూ ప్రధాని మోదీ చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు ఈ వీడియో సమావేశంలో పాల్గొననున్నారు. Read More: కొత్తగా 62,064 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15,35,744 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,007 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 44,386 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 6,34,945 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


By August 11, 2020 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-video-conference-with-chief-ministers-today-over-coronavirus-cases/articleshow/77476148.cms

No comments