Breaking News

ఐస్‌క్రీమ్‌లో విషం కలిపి సోదరిని హత్యచేసిన అన్న.. కారణం ఇదే


ఆగస్టు 5న తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ మృతిచెందిన 16 ఏళ్ల కేరళ బాలిక కేసును పోలీసులు చేధించారు. విషం కలిపిన ఐస్‌క్రీం తినడం వల్లే ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. స్వయంగా సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపారు. ఆమెతో సహా కుటుంబాన్ని హతమార్చడానికి ఐస్‌క్రీమ్‌లో విషం కలిపినట్టు దర్యాప్తులో తేలింది. ఒంటరిగా ఉండాలనే కుటుంబం మొత్తాన్ని హత్యచేయాలని పథకం వేశాడని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం ఐస్‌క్రీంలో విషం కలిపి తల్లిదండ్రులు, సోదరికి ఇచ్చినట్టు పేర్కొన్నారు. కాసర్‌గఢ్‌కు చెందిన అల్బిన్ (22) అనే యువకుడు ఒంటరి జీవితం గడపాలని భావించాడు. దీంతో కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలని నిర్ణయించుకుని, వారి హత్యకు పథకం వేశాడు. తల్లిదండ్రులు, సోదరికి ఐస్‌క్రీంలో విషం కలిసి ఇచ్చాడు. ఆగస్టు 5న ఐస్‌క్రీం తిన్న తర్వాత నిందితుడి తండ్రి, సోదరి అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం హాస్పిటల్‌లో చేర్పించారు. బాలిక చికిత్స పొందుతూ అస్పత్రిలో చనిపోయింది. ఇదే ఐస్‌‌క్రీమ్ తిన్న నిందితుడి తల్లికి మాత్రం ఏంకాలేదని పోలీసులు తెలిపారు. ఐస్‌‌క్రీంలో విషం కలిపినట్టు నిందితుడి వెల్లడించాడని, అతడి స్టేట్‌మెంట్‌ను నమోదుచేశామని పోలీసులు వివరించారు. నిందితుడి అల్బిన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన తండ్రి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. అతడి తల్లి క్షేమంగానే ఉన్నారని, ఆమెకు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారన్నారు.


By August 14, 2020 at 11:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-youth-allegedly-kills-sister-by-mixing-poison-in-ice-cream-arrested/articleshow/77539912.cms

No comments