Breaking News

నేపాల్‌లో అత్యంత అరుదైన తాబేలు.. విష్ణమూర్తి అవతారంగా కొలుస్తున్న జనం!


నేపాల్‌లో అరుదైన తాబేలును గుర్తించారు. అరుదైన జన్యు పరివర్తన కారణంగా ఈ తాబేలు బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. దీంతో ఈ తాబేలును జనం దేవుడిగా కొలుస్తున్నారు. ఈ అరుదైన తాబేలును నేపాల్‌లోని ధనుషా జిల్లాలోని ధనుషదమ్ మున్సిపాలిటీలో గుర్తించారు. , భారత్‌లోని హిందువులు తాబేలును విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారని తెలిసిందే. కూర్మావతారం ధరించిన విష్ణుమూర్తి.. ఈ లోకాన్ని కాపాడాడని హిందువులు విశ్వసిస్తారు. నేపాల్‌లోనూ కూర్మావతారంలోని విష్ణుమూర్తికి అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ అరుదైన తాబేలును కూడా విష్ణుమూర్తి అవతారంగా భావిస్తోన్న నేపాలీలు.. పూజలు చేస్తున్నారు. తాబేలు పైభాగం ఆకాశానికి, కింది భాగం భూమికి సంకేతంగా భావిస్తారని సరీసృపాల నిపుణుడైన కమల్ దేవ్‌కోట తెలిపారు. క్రొమాటిక్ ల్యూసిజం కారణంగా ఈ తాబేలు అరుదైన పసిడి వర్ణంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగారు రంగులో కనిపించే తాబేలును గుర్తించడం ప్రపంచంలో ఇది ఐదోసారి కాగా.. నేపాల్‌లో ఇదే మొదటిసారి. ల్యూసిజం కారణంగా ఇలా అరుదైన వర్ణంలో ఉండే జంతువులను పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకే వాటి ధర కూడా ఎక్కువగా ఉంటుందని కమల్ తెలిపారు.


By August 20, 2020 at 09:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/turtle-with-golden-shell-identified-in-nepal-for-the-first-time/articleshow/77647005.cms

No comments